ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి

  • హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం
  • ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత
  • ఆయనను పరామర్శించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
  • కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాల సేకరణ
  • ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సాయిరెడ్డి
మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురవడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నరాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ముద్రగడ పద్మనాభం ఐసీయూలో చికిత్స పొందుతుండటంతో, విజయసాయిరెడ్డి నేరుగా ఆయన్ను కలవలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ముద్రగడ గిరి, ఇతర కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి, చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఉన్నత రాజకీయ విలువలు కలిగిన ముద్రగడ పద్మనాభం గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Mudragada Padmanabham
Vijayasai Reddy
Sindhu Hospital Hyderabad
Mudragada Padmanabham health update
Kapu leader Mudragada
YSRCP leaders visit

More Telugu News